ప్లంబర్ అకౌంట్లో రూ.294 కోట్లు.. రూ.114 నుంచి రూ.294 కోట్లకు.. షాక్లో ప్లంబర్!
బిహార్కు చెందిన వికాస్ కుమార్ బ్యాంక్ ఖాతాలో కేవలం రూ.114 మాత్రమే బ్యాలెన్స్ ఉండేది. అయితే గురువారం ఉదయం తన ఖాతాను పరిశీలించగా ఏకంగా రూ.94 కోట్లకు పైగా బ్యాలెన్స్ కనిపించింది. మొదట ఇది సాంకేతిక లోపం (టెక్నికల్ ఎర్రర్) అయి ఉండొచ్చని భావించిన వికాస్, కొంత సమయం తర్వాత మళ్లీ చెక్ చేయగా ఖాతాలోని మొత్తం మరింత పెరిగి సాయంత్రానికి రూ.294 కోట్లకు చేరినట్లు కనిపించింది. అంత భారీ మొత్తం తన ఖాతాలో కనిపించడంతో భయాందోళనకు గురైన వికాస్, వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించాడు. అనంతరం స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించాడు. మరుసటి రోజూ అదే మొత్తం ఖాతాలో కనిపించడంతో ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.

నిజం న్యూస్, జూన్ 7, 2026
బిహార్లో ఓ ప్లంబర్ బ్యాంక్ ఖాతాలో అనూహ్యంగా రూ.294 కోట్లు జమ కావడం సంచలనంగా మారింది. సాధారణంగా రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వికాస్ కుమార్ అనే ప్లంబర్ తన ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ను చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు.
వివరాల్లోకి వెళితే.. బిహార్కు చెందిన వికాస్ కుమార్ బ్యాంక్ ఖాతాలో కేవలం రూ.114 మాత్రమే బ్యాలెన్స్ ఉండేది. అయితే గురువారం ఉదయం తన ఖాతాను పరిశీలించగా ఏకంగా రూ.94 కోట్లకు పైగా బ్యాలెన్స్ కనిపించింది. మొదట ఇది సాంకేతిక లోపం (టెక్నికల్ ఎర్రర్) అయి ఉండొచ్చని భావించిన వికాస్, కొంత సమయం తర్వాత మళ్లీ చెక్ చేయగా ఖాతాలోని మొత్తం మరింత పెరిగి సాయంత్రానికి రూ.294 కోట్లకు చేరినట్లు కనిపించింది.
అంత భారీ మొత్తం తన ఖాతాలో కనిపించడంతో భయాందోళనకు గురైన వికాస్, వెంటనే సంబంధిత బ్యాంకు అధికారులను సంప్రదించాడు. అనంతరం స్థానిక పోలీసులకు కూడా సమాచారం అందించాడు. మరుసటి రోజూ అదే మొత్తం ఖాతాలో కనిపించడంతో ఈ ఘటన మరింత చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో బ్యాంకు అధికారులు, పోలీసులు సంఘటనపై విచారణ ప్రారంభించారు. ఖాతాలో కనిపించిన భారీ మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక లోపమా? లేక సైబర్ మోసం, అక్రమ నగదు బదిలీ లేదా మనీలాండరింగ్కు సంబంధించిన అంశమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
బ్యాంకు అధికారులు ప్రాథమికంగా ఖాతా లావాదేవీల వివరాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. విచారణ పూర్తయ్యే వరకు ఖాతాలోని నిధులను వినియోగించవద్దని వికాస్కు సూచించినట్లు తెలుస్తోంది.
ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా బ్యాంక్ ఖాతాల్లో అనుకోకుండా భారీ మొత్తాలు జమ అయిన ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, ఈ సంఘటన కూడా అలాంటి సాంకేతిక లోపం కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అధికారిక దర్యాప్తు పూర్తయిన తర్వాతే అసలు కారణం వెల్లడయ్యే అవకాశం ఉంది.



