సర్వీస్ బుక్ ఎంట్రీలకు లంచం డిమాండ్ చేశారంటూ పంచాయతీ కార్యదర్శి ఆరోపణ
లచ్చాతండా గ్రామ పంచాయతీ కార్యదర్శి సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో తాళ్లమల్కాపురం గ్రామపంచాయతీకి సంబంధించిన జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు, ఎంపీడీవో జాయినింగ్ ఆర్డర్, ప్రస్తుత లచ్చాతండా జాయినింగ్ ఆర్డర్ వివరాలను తన సర్వీస్ బుక్లో నమోదు చేయాల్సి ఉంది. అయితే మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ సహాయకుడు మొయినుద్దీన్ గత మూడేళ్లుగా ఈ ప్రక్రియను పెండింగ్లో ఉంచినట్లు ఆరోపించారు.

గరిడేపల్లి మే 30(నిజం చెపుతాం)
గరిడేపల్లి ఎంపీడీవో ఆఫీసులో మలకపురం కార్యదర్శి జాయినింగ్ సర్వీస్ బుక్లో ఉద్యోగ సంబంధిత ఆర్డర్లు నమోదు చేయడానికి లంచం డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ పంచాయతీ కార్యదర్శి మండల పరిషత్ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేసిన ఘటన శనివారం కలకలం రేపింది.
లచ్చాతండా గ్రామ పంచాయతీ కార్యదర్శి సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో తాళ్లమల్కాపురం గ్రామపంచాయతీకి సంబంధించిన జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు, ఎంపీడీవో జాయినింగ్ ఆర్డర్, ప్రస్తుత లచ్చాతండా జాయినింగ్ ఆర్డర్ వివరాలను తన సర్వీస్ బుక్లో నమోదు చేయాల్సి ఉంది. అయితే మండల పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ సహాయకుడు మొయినుద్దీన్ గత మూడేళ్లుగా ఈ ప్రక్రియను పెండింగ్లో ఉంచినట్లు ఆరోపించారు.
సర్వీస్ బుక్లో ఎంట్రీలు చేయాలంటే రూ.3,000 ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఇతర పంచాయతీ కార్యదర్శులు కూడా ఇదే విధంగా డబ్బులు చెల్లించారని తనపై ఒత్తిడి తెచ్చినట్లు సుధాకర్ ఆరోపించారు.
జూన్ 1న మొయినుద్దీన్ జిల్లా పరిషత్ కార్యాలయానికి బదిలీపై వెళ్లనున్న నేపథ్యంలో, తన సర్వీస్ బుక్లో వివరాలు నమోదు కాకపోతే సీనియారిటీ, పదోన్నతులపై ప్రభావం పడే అవకాశం ఉందని సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో సీనియర్ సహాయకుడి వాహనాన్ని అడ్డుకొని నిరసన తెలిపారు. ఘటనతో కార్యాలయ ఆవరణలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, తన సర్వీస్ బుక్లో పెండింగ్లో ఉన్న వివరాలను నమోదు చేయాలని పంచాయతీ కార్యదర్శి కోరారు.
లంచం డిమాండ్ చేసినట్లు చేసిన ఆరోపణలపై సంబంధిత సీనియర్ సహాయకుడి వివరణ అందాల్సి ఉంది. హెడ్లైన్ సర్వీస్ బుక్ ఎంట్రీలకు రూ.3 వేల లంచం డిమాండ్ చేశారంటూ ఆరోపణ గరిడేపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు.



