మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి..
గా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇటీవల ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి తొలుత హన్మకొండలోని రోహిణి ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించి వైద్యులు ప్రత్యేక చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన వెంటనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తదితరులు ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని విధాలుగా సహకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

కుటుంబ సభ్యులు, అనుచరులు, బీఆర్ఎస్ నాయకుల్లో తీవ్ర విషాదం
హైదరాబాద్, నిజం న్యూస్, జూలై 31:
వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 12:51 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరులు, అభిమానులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర విషాదం నెలకొంది.
ఇటీవల ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి తొలుత హన్మకొండలోని రోహిణి ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించి వైద్యులు ప్రత్యేక చికిత్స అందించారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసిన వెంటనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తదితరులు ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని విధాలుగా సహకరించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
పెద్ది సుదర్శన్ రెడ్డి పార్థివ దేహాన్ని శుక్రవారం ఉదయం నర్సంపేటలో ప్రజల సందర్శనార్థం కొంతసేపు ఉంచనున్నారు. అనంతరం ఆయన స్వగ్రామమైన నల్లబెల్లికి తరలించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు నల్లబెల్లిలో పార్టీ నాయకులు, అభిమానుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మృతి పార్టీకి, నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.
ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు రాజకీయ, ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు.
— శ్రీనివాస్ నాయక్
స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



