లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎంపీడీవో.. మహబూబాబాద్ జిల్లాలో కలకలం!

నర్సింహులపేట మండల ఎంపీడీవో పెనుగొండ రాధిక, ఎంపీవో కె. యాకయ్య, అలాగే ఎంపీడీవో వ్యక్తిగత సహాయకుడు మరియు డ్రైవర్‌గా పనిచేస్తున్న సి. నాగార్జునను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

నిజం న్యూస్, మహబూబాబాద్, జూన్ 12:

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు చేపట్టిన దాడుల్లో ఎంపీడీవో సహా ముగ్గురు వ్యక్తులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడటం సంచలనంగా మారింది.

నర్సింహులపేట మండల ఎంపీడీవో పెనుగొండ రాధిక, ఎంపీవో కె. యాకయ్య, అలాగే ఎంపీడీవో వ్యక్తిగత సహాయకుడు మరియు డ్రైవర్‌గా పనిచేస్తున్న సి. నాగార్జునను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 

ఏసీబీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పదమటిగూడెం గ్రామానికి చెందిన ఫిర్యాదుదారుడి భూమిలో 15.75 శాతం భాగాన్ని లేఅవుట్ అభివృద్ధి పనుల కోసం గ్రామ పంచాయతీకి భద్రతగా తాకట్టు పెట్టే ప్రక్రియలో అనుకూల నిర్ణయం తీసుకునేందుకు అధికారులు లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

 

ఈ క్రమంలో ఎంపీడీవో పెనుగొండ రాధిక రూ.20 వేల లంచం, ఎంపీవో కె.యాకయ్య రూ.25 వేల లంచం స్వీకరించినట్లు ఏసీబీ వెల్లడించింది. ఎంపీడీవో తన కుమారుడు నాగార్జున ద్వారా ఈ నగదును స్వీకరించినట్లు అధికారులు గుర్తించారు. నర్సింహులపేట ఎంపీడీవో కార్యాలయంలోనే ఈ ముగ్గురిని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం.

 

ఇప్పటికే సంబంధిత అధికారులు ఫిర్యాదుదారుడి నుంచి గతంలో కూడా లంచం తీసుకున్నట్లు విచారణలో వెలుగులోకి వచ్చినట్లు ఏసీబీ తెలిపింది. స్వాధీనం చేసుకున్న లంచం మొత్తాన్ని అధికారులు సీజ్ చేసి, నిందితులను అరెస్ట్ చేసి వరంగల్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

 

ప్రజా సేవకులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button