ఇస్రోలో శాస్త్రవేత్తగా ఎంపికైన జగిత్యాల యువకుడు

జగిత్యాల జిల్లాకు చెందిన ముమ్మడి రాజసింహ అనే యువకుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు.

జగిత్యాల జిల్లాకు చెందిన ముమ్మడి రాజసింహ అనే యువకుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యాడు.

కొడిమియల్ మండలానికి చెందిన రాజసింహ జగిత్యాలలో పాఠశాలలో ప్రాథమిక విద్యను,  వరంగల్‌లో ఇంటర్మీడియట్ ను పూర్తి చేశాడు. అతను JEE అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరై కేరళలోని తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో అత్యున్నత ర్యాంకు సాధించాడు.

ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నప్పుడు, అతను క్యాంపస్ ఇంటర్వ్యూలకు హాజరై ఇస్రోలో శాస్త్రవేత్త పదవికి ఎంపికయ్యాడు. ఇతని తల్లితండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులు రాజశేఖర్, ఉమారాణి ల కుమారుడు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button