రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ముదిగొండ మండలం భానాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.

స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

ఖమ్మం జిల్లాలో అవినీతిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) మరోసారి ఉక్కుపాదం మోపింది. ముదిగొండ మండలం భానాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి తమ్మిశెట్టి సురేష్ రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు.

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, భవన నిర్మాణ అనుమతి (బిల్డింగ్ పర్మిషన్) మంజూరు చేయడంతో పాటు ఇంటి నంబర్ కేటాయించేందుకు ఫిర్యాదుదారుని నుంచి రూ.25,000 లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు ఫిర్యాదు అందడంతో ఖమ్మం రేంజ్ ఏసీబీ అధికారులు ఉచ్చుపన్ని, ముదిగొండ మండలంలోని రితు వేదిక సమీపంలో లంచం స్వీకరిస్తున్న సమయంలో కార్యదర్శిని పట్టుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి రూ.25 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు, అతడిని అరెస్టు చేసి వరంగల్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ తెలిపింది.

అధికారులు ఎవరైనా ప్రజా సేవల కోసం లంచం డిమాండ్ చేసినట్లయితే వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని, ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని ప్రజలకు సూచించారు.

— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button