అకస్మాత్తుగా చెలరేగిన మంటలు… భయాందోళనలకు గురైన రైతులు

ఈ క్లిష్ట సమయంలో వెంటనే స్పందించి పొలాలను రక్షించిన అగ్నిమాపక సిబ్బందికి తండ ధర్మారం గ్రామ రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు

అగ్నిమాపక సిబ్బంది చొరవతో పరిస్థితి అదుపులో 

 

స్టేట్ బ్యూరో, శ్రీనివాస్ నాయక్ ,ఏప్రిల్ 14: నిజం న్యూస్

 

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తండ ధర్మారం గ్రామ పరిధిలోని వరి పొలాల్లో ఈరోజు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించడం స్థానికంగా కలకలం రేపింది.

ఒక్కసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపిస్తూ పొలాలను ఆవరించడంతో రైతులు భయాందోళనలకు గురయ్యారు.

క్షణాల్లోనే పరిస్థితి విషమించవచ్చనే ఆందోళన నెలకొంది.

 

అయితే సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది అత్యంత వేగంగా స్పందించి సంఘటన స్థలానికి చేరుకుని సాహసోపేతంగా మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

వారి సమయోచిత చర్యలు, అప్రమత్తతతో భారీ నష్టం నుండి పంటలను కాపాడడం జరిగినది. దీంతో గ్రామంలోని రైతులు కొంత ఊపిరి పీల్చుకున్నారు.

 

ఈ సంఘటన రైతులకు గట్టి హెచ్చరికగా నిలిచింది. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఎంతటి ప్రమాదానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి స్పష్టంగా తెలియజేసింది.

రైతుల జీవనాధారమైన పంటలు ప్రమాదంలో పడిన నేపథ్యంలో బాధిత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఈ క్లిష్ట సమయంలో వెంటనే స్పందించి పొలాలను రక్షించిన అగ్నిమాపక సిబ్బందికి తండ ధర్మారం గ్రామ రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే మంటలను అదుపులోకి తీసుకురావడంలో ముందుండి సహకరించిన జి. ఆకు, జి. చందు, జి. పవన్ కళ్యాణ్, జి. రాందాస్, జి. బులాయి, బి. సోనియా, జి. టాకు తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button