మహబూబ్నగర్లో ఏసీబీ వలలో సర్వే శాఖ సూపరింటెండెంట్
రూ.15 వేల లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన అధికారి

నిజం న్యూస్ హైదరాబాద్, జూలై 9, 2026:
మహబూబ్నగర్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో అవినీతి బాగోతం వెలుగుచూసింది. నిన్న (జూలై 8) రూ.15 వేల లంచం తీసుకుంటూ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ బొమ్మిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డిని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం, మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కర్వేన గ్రామానికి సంబంధించిన గ్రామ మ్యాప్లో సవరణలు చేయించే ఫైల్ను అసిస్టెంట్ డైరెక్టర్కు పంపించి అధికారిక అనుకూలం కల్పించేందుకు ఫిర్యాదుదారుని నుంచి రూ.15,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.
అధికారి వద్ద నుంచి రూ.15 వేల లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఆయన విధులను అక్రమంగా, అవినీతికి పాల్పడుతూ నిర్వహించినట్లు నిర్ధారించింది.
నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ వెల్లడించింది.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే 1064 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని ఏసీబీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.
— శ్రీనివాస్ నాయక్, స్టేట్ బ్యూరో, నిజం న్యూస్



