ముంబైపై రాయల్స్ ‘రాజసం’..!
హ్యాట్రిక్ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి.!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) తమ అజేయ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. మంగళవారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత పోరులో ముంబై ఇండియన్స్ను 27 పరుగుల తేడాతో చిత్తు చేసి, ఈ సీజన్లో వరుసగా మూడవ విజయాన్ని (హ్యాట్రిక్) నమోదు చేసింది. వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో రాయల్స్ బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణించి ముంబైని ముంచేశారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 11 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 150 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కేవలం 32 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 77 పరుగులు చేసి ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (14 బంతుల్లో 39) అతనికి చక్కని సహకారం అందించాడు.
151 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 123 పరుగులకే పరిమితమైంది. స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ (5), సూర్యకుమార్ యాదవ్ (6), హార్దిక్ పాండ్యా (9) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. రాజస్థాన్ బౌలర్లలో నండ్రే బర్గర్, సందీప్ శర్మ మరియు రవి బిష్ణోయ్ తలా రెండు వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాసించారు.
పాయింట్ల పట్టికలో టాప్:
ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. రియాన్ పరాగ్ సారథ్యంలో రాయల్స్ జట్టు ఈసారి టైటిల్ ఫేవరెట్గా కనిపిస్తోంది. మరోవైపు, హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్కు ఇది ఈ సీజన్లో రెండవ ఓటమి. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన యశస్వి జైస్వాల్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.



