T20 WORLD CUP : జింబాబ్వే పై 17 సిక్సర్లు, 17 ఫోర్లతో టి20 ప్రపంచ కప్‌లలో భారత్ మరో రికార్డు

T20 WORLD CUP : భారతదేశం 17 సిక్సర్లు,  17 ఫోర్లు బాది, బౌండరీలతోనే  170 పరుగులు చేశారు. పురుషుల టి20 ప్రపంచ కప్‌లలో భారత్ కు ఇది మరో రికార్డు

T20 WORLD CUP : గురువారం జరిగిన ఐసిసి పురుషుల టి20 ప్రపంచ కప్ 2026 సూపర్ ఎయిట్ మ్యాచ్‌లో జింబాబ్వేపై భారత్ 256/4 స్కోరు చేయడంతో ఈ సీజన్ లో అత్యధిక స్కోరును నమోదు చేశారు. ఇది టి20 ప్రపంచ కప్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోరును నమోదు చేశారు.

 

అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్య హాఫ్ సెంచరీలు సాధించడంతో భారత్ మూడు రోజుల క్రితం జింబాబ్వేపై వెస్టిండీస్ నమోదు చేసిన 254/6 స్కోరును అధిగమించింది.

 

2007లో శ్రీలంక సాధించిన  260 పరుగుల రికార్డుకు కేవలం నాలుగు పరుగుల దూరంలో ఆగిపోయింది.

ఈ ఇన్నింగ్స్‌లో  భారతదేశం 17 సిక్సర్లు,  17 ఫోర్లు బాది, బౌండరీలతోనే  170 పరుగులు చేశారు. పురుషుల టి20 ప్రపంచ కప్‌లలో భారత్ కు ఇది మరో రికార్డు

బ్రియాన్ బెన్నెట్ 97 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.  జింబాబ్వేను 184/6 స్కోరు చేసి 72 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

ఆస్ట్రేలియా, శ్రీలంకలను ఓడించి T20 ప్రపంచ కప్‌లో తొలిసారిగా సూపర్ 8 కు జింబాబ్వేకు చేరుకున్న విషయం తెలిసిందే.

గ్రూప్ 1లో దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ చేరుకుంది.  ఆదివారం జరగనున్న భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ లో విజయం సాధించిన వారు మరో టీంగా సెమీస్ కు చేరుకుంటారు.

టాస్ గెలిచిన  జింబాబ్వే కెప్టెన్ సికందర్ రాజా భారత్‌ను బ్యాటింగ్‌కు పంపాడు.

సంజు సామ్సన్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తిరిగి వచ్చి, అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు.  ఇన్నింగ్స్‌లోని రెండవ బంతిని సిక్స్‌గా కొట్టడం విశేషం

నాల్గవ ఓవర్‌లో సామ్సన్ అవుట్ అయినప్పటికీ , పవర్‌ప్లేలో 80/1కి చేరుకుంది.

టోర్నమెంట్ ఫామ్‌ కోసం ఇబ్బంది పడిన శర్మ తొలి T20I అర్ధ సెంచరీని 26 బంతుల్లో పూర్తి చేశాడు.   నాలుగు ఫోర్లు మరియు నాలుగు సిక్సర్ల సహాయంతో 30 బంతుల్లో 55 పరుగులు చేశాడు.

13వ ఓవర్‌లో 150 పరుగులు, 17వ ఓవర్‌లో 200 పరుగులకు చేరుకున్నారు.  250. హార్దిక్ పాండ్యా,  తిలక్ వర్మ (44 నాటౌట్) విజృంభణతో ఐదవ వికెట్ భాగస్వామ్యానికి కేవలం 31 బంతుల్లో 84 పరుగులు చేశారు.

పాండ్యా చివరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు కొట్టి 23 బంతుల్లో 50 పరుగులు చేసి భారత్‌ను ఆ రికార్డు స్థాయి పరుగులు చేసేలా తోడ్పడ్డాడు.

జింబాబ్వే బాట్స్ మెన్  బెన్నెట్ మరో అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో  సిక్సర్ కొట్టి 36 బంతుల్లో 50 పరుగులు చేశాడు. రజా (31) కాకుండా, బెన్నెట్‌కు పెద్దగా మద్దతు లేదు,  59 బంతుల్లో అజేయంగా 97 పరుగులు చేసి మ్యాచ్‌లో అత్యధిక స్కోరర్‌గా నిలిచాడు.

 

బౌలర్లకు పెద్దగా సహాయం చేయని పిచ్ పై నాలుగు ఓవర్లలో 3/24 వికెట్లు పడగొట్టి పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అత్యుత్తమ గణాంకాలను నమోదు చేసాడు.

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button