తెలంగాణలో కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు..?
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ..!

తెలంగాణలో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ విషయంలో జరుగుతున్న ఆలస్యంపై కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, ఆమె దరఖాస్తును త్వరగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ECI) మార్చి 19న ఆదేశించింది.జనవరి 23నే ఆమె దరఖాస్తు చేసుకున్నప్పటికీ, కొన్ని లోపాల వల్ల ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ఆ లోపాలను సరిదిద్దినట్లు ఆమె తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.
మే మొదటి వారంలో పార్టీ పేరు, జెండా మరియు అజెండాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె సిద్దిపేట లేదా బోధన్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సామాజిక తెలంగాణ” మరియు యువత సంక్షేమమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని కవిత వెల్లడించారు.
గత ఏడాది (సెప్టెంబర్ 2025) బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత, కవిత తన తండ్రి కేసీఆర్ మరియు ఇతర నేతలపై తీవ్ర విమర్శలు చేస్తూ బయటకు వచ్చారు. తన సామాజిక సంస్థ ‘తెలంగాణ జాగృతి’ని ఇప్పుడు రాజకీయ శక్తిగా మారుస్తున్నారు.



