2031 వన్డే ప్రపంచ కప్‌ కు అతిథ్యమివ్వనున్న భారత్

2029 ఛాంపియన్స్ ట్రోఫీ,  2031 వన్డే ప్రపంచ కప్‌లను భారతదేశం నిర్వహిస్తుందని ఐసిసి నిర్ధారించింది.  భారత్ ఇప్పటివరకు 4 సార్లు వన్డే వరల్డ్ కప్ ఆతిథ్యం ఇచ్చింది (1987, 1996, 2011, 2023).

2029 ఛాంపియన్స్ ట్రోఫీ,  2031 వన్డే ప్రపంచ కప్‌లను భారతదేశం నిర్వహిస్తుందని ఐసిసి ప్రకటించింది. అయితే

భారత్ ఇప్పటివరకు 4 సార్లు వన్డే వరల్డ్ కప్ ఆతిథ్యం ఇచ్చింది (1987, 1996, 2011, 2023). 2031 వన్డే ప్రపంచకప్ ఇండియా అతిథ్యమిచ్చే 5 వ వన్డే వరల్డ్ కప్ అవుతుంది.

1987 లో మొదటి సారిగా భారత్ వేదికగా వరల్డ్ కప్ ను నిర్వహించారు. ఇది ఆసియాలో జరిగిన మొదటి ప్రపంచకప్. దీనికి భారత్ తో పాటు పాకిస్తాన్ కు కూడా అతిథ్యమిచ్చింది. ఈ వరల్డ్ కప్ ను అస్ట్రేలియా దక్కించుకుంది.

1996 లో రెండో సారి వరల్డ్ కప్ కు ఇండియా, పాకిస్తాన్, శ్రీలంకలు అతిథ్యమిచ్చాయి. ఈ వరల్డ్ కప్ ను శ్రీలంక దక్కించుకుంది.

2011లో మూడోసారి వన్డే వరల్డ్ కప్ కు ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్ లు అతిథ్య మిచ్చాయి. ఈ వరల్డ్ కప్ ను భారత్ దక్కించుకుంది.

2023లో నాలుగో సారి వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరిగింది. దీనికి ఇండియా మాత్రమే అతిథ్య మిచ్చింది. ఈ వరల్డ్ కప్ ను అస్ట్రేలియా దక్కించుకుంది.

 

 

Kamalla Kranthi Kumar

కామళ్ల క్రాంతికుమార్ సీనియర్ జర్నలిస్ట్. ఈయన పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో నమస్తే తెలంగాణలో 11 సంవత్సరాలు పనిచేసారు. ప్రస్తుతం నిజం చెపుతాం దినపత్రిక ఎడిటర్ గా పని చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button