రంజీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక (KAR) మరియు జమ్మూ కాశ్మీర్ (JAM) జట్లు
మంగళవారం హుబ్లీలోని డి.ఆర్. బెంద్రే క్రికెట్ స్టేడియంలో తలపడుతున్నాయి.
జమ్మూ అండ్ కాశ్మీర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి జమ్మూ కాశ్మీర్ 284/2 (87.0 ఓవర్లు) తో పటిష్ట స్థితిలో నిలిచింది.
జమ్మూ కాశ్మీర్ తరఫున శుభమ్ పుండిర్ 117 పరుగులు (221 బంతులు) తో నాటౌట్ గా నిలిచాడు. అబ్దుల్ సమద్ 52 పరుగులతో (67 బంతులు) నాటౌట్ గా నిలవగా YH ఖాన్ 88(150) పరుగులతో రాణించాడు.
కర్ణాటక బౌలర్ ప్రసిద్ధి కృష్ణ రెండు వికెట్లను తీసి జమ్మూ కాశ్మీర్ మరిన్ని పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు.
ఇరు జట్ల ఫైనల్ ప్రస్తానాన్ని ఒకసారి పరిశీలిస్తే…
జమ్మూ కాశ్మీర్: తొలిసారి రంజీ ఫైనల్కు చేరుకుంది
కర్ణాటక: 11 ఏళ్ల తర్వాత రంజీ ఫైనల్లోకి ప్రవేశించింది.
2023లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ పై 222 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.