Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

లోయలోకి దూసుకెళ్లిన బస్సు

28 మంది యాత్రికులతో లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. హైదరాబాద్ బ్యూరో మే 5 (నిజం న్యూస్) ఉత్తరాఖండ్​, ఉత్తరకాశీ జిల్లాలోని డామ్టా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. యమునోత్రి రహదారిపై 28 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు 200 మీటర్ల లోతు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ఆరుగురిని ఆసుపత్రికి తరలించారు.

Also Read:జామ తోట తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు

సమాచారం అందుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. యాత్రికులంతా మధ్యప్రదేశ్​లోని పన్నా జిల్లాకు చెందినవారిగా పోలీసులు తెలిపారు. వారంతా యమునోత్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. 22 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు.