Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తండ్రిని హత్య చేసిన కొడుకులు

 

భూమి ని పంచివ్వలేదని కన్న తండ్రి ని నరికి చంపిన ఇద్దరు కొడుకులు!

– ఆత్మకూరు ఎస్ మండలం తుమ్మల పెన్ పాడ్ లో ఘటన. విచారణ జరుపుతున్న పోలీసులు.

సూర్యాపేట ఏప్రిల్ 12 నిజం న్యూస్

భూమిని పంచివ్వలేదన్న కారణంతో,కన్నా తండ్రిని, ఇద్దరు కొడుకులు అతి దారుణంగా నరికి చంపిన సంఘటన గురువారం ఆత్మకూరు (ఎస్) మండల తుమ్మల పెన్ పాడ్ గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
గ్రామనికి చెందిన ఎరగాని శ్రీను గౌడ్ (50) కి కొంత వ్యవసాయ భూమి ఉంది.గత కొంత కాలంగా శ్రీను ఇద్దరు కొడుకులు సంతు,రాజశేఖర్ లు ఆ భూమి ని పంచిఇవ్వాలని తండ్రితో గొడవలు పడేదని తెలుస్తోంది.ఎన్ని సార్లు అడిగిన భూమి పంచి ఇవ్వకపోవడంతో ఈ రోజు ఉదయం తండ్రి శ్రీను పై గొడ్డలి,కత్తి తో దాడి చేసి,అతి దారుణంగా హత్య చేశారు.మృతుడికి భార్య,ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు.సంఘటన స్థలానికి పోలీస్ లు చేరుకొని విచారణ చేపట్టారు.