చర్ల లో గుప్త నిధులు లభ్యం.!

-సమాచారం గోప్యంగా ఉంచిన ఇంటి యజమాని
చర్ల ఏప్రిల్ 12 (నిజం న్యూస్) చర్ల మండలంలో గుప్త నిధుల లభ్యం దావానలంలా వ్యాపించింది. గుప్త నిధులు ఉన్న పెట్టె దొరికిందని ప్రచారం సాగుతోంది. గాంధీ బొమ్మ సెంటర్ లో గల ఆంజనేయ స్వామి ఆలయం పక్కన ఇంటి నిర్మాణం కోసం ఓ వ్యక్తి కూలీలతో పునాదులు తవ్విస్తుండగా శబ్దం రావడంతో అర్ధాంతరంగా పనులు ఆపివేసి యజమాని కూలీలను ఇంటికి పంపి ఇంటి యజమానులు తవ్వకాలు జరిపి గుప్త నిధులు మాయం చేశారని వదంతులు దావానంలా మండలంలో వ్యాపించాయి.
Also read: ఆర్టీసీడ్రైవర్ పై టీచర్ దాడి
ఈ సంఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నా ఇంటి యజమానిగోప్యంగా ఉంచినట్లు సమాచారం ఈ విషయంపై పోలీసులు విచారణ చేపడితే తప్ప వీడనున్న అసలు రహస్యం