Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఏసిబి వలలో మెదక్ జిల్లా అధికారిని

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో సహాయ కోశాధికారి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న మమత అనే ఉద్యోగిని ఖదీర్ అనే వక్తి నుండి నాలుగు వేల రూపాయలు లంచం తీసుకొంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఖదీర్ వాళ్ల నాన్న ఉపాధ్యాయుడిగా నిర్వహించి చనిపోవడంతో తన తల్లికి వస్తుందని తన తల్లికి కూడా సంవత్సరం క్రితం చనిపోయిందని ఆ తరువాత ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్ కోసం సంవత్సర కాలం నుండి కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఎవరు తనని పట్టించుకోవడంలేదని పైసలిస్తేనే పని అవుతుందని ఐదు వేల రూపాయలు డిమాండ్ చేయగా చివరికి నాలుగు వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని ఈరోజు మూడు గంటల ప్రాంతంలో 4000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

also read: 18 గంటల పాటు లాకర్ గదిలోనే వృద్ధుడు

మమతను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని చేస్తున్నారు. పై అధికారుల సూచనల మేరకు మమత ను తదుపరి విచారణ తర్వాత డిమాండ్ చేసే అవకాశం కూడా ఉందని ఏసీబీ అధికారులు మీడియా సమావేశంలో తెలిపారు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే దృష్టికి తీసుకురావాలని టోల్ ఫ్రీ నెంబర్ 104 కి ఫిర్యాదు చేస్తే తాము చర్యలు తీసుకునే అవకాశం ఉందని అందరూ ముందుకు రావాలని వారు కోరారు ఎస్ పి ఆనంద్ కుమార్ వెంబడా సీఐ వెంకట రాజు గౌడ్ మరియు రమేష్ ఉన్నారు..