టైరు పేలడంతో ఘోర రోడ్డు ప్రమాదం…ఐదుగురు దుర్మరణం

ఆర్టీసీ బస్సు ముందు టైరు పేలడంతో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా ఓక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
కామారెడ్డి మార్చి28 నిజం న్యూస్
పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి వైపు నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, 10 సంవత్సరాల బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా రాఘవ కు 14 సంవత్సరాలు గాయాలయ్యాయి.
ఆర్టీసీ బస్సు ముందు టైర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు నెంబర్ ఆధారంగా మృతులంతా నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లికి చెందినవారిగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన బాలుడుని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.