Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కొడుకు చేతిలో తండ్రి హతం

రాజపేట మార్చి 27 ( నిజం న్యూస్ ) యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం చల్లూరు గ్రామంలో గుంటి పల్లె పాటి స్వామి అనుమానాస్పద మృతి నిన్న భార్యాభర్తలు తగాదాల విషయంలో అతని పెద్దకొడుకు గుంటి కృష్ణ కలగజేసుకుని తండ్రి పై దాడి చేయగా తండ్రి గుంటి స్వామి బలమైన గాయాలతో మృతి చెందాడు గ్రామస్తులు బంధువులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తండ్రి చనిపోవడంతో భయాందోళనకు గురైన కొడుకు కృష్ణ ఈ సంఘటన కప్పిపుచ్చడానికి శుక్రవారం అర్ధరాత్రి అకస్మాత్తుగా తండ్రి శవాన్ని జనగామ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు మార్గమధ్యలో చనిపోయాడని గ్రామస్తులకు కుటుంబసభ్యులు ఈ విషయం ప్రారంభించారు

Also read: మావోయిస్టుల చేతిలో కానిస్టేబుల్ హత్య

ఈ క్రమంలో సాంప్రదాయంగా శవాన్ని స్నానం చేస్తున్న సమయంలో బొడ్డు కింది భాగం భాగం నుండి కాళ్ళ వరకు తీవ్రగాయాలు గమనించిన గ్రామస్తులు అనుమానంతో 100కు డయల్ చేయగా రాజపేట ఎస్సై శ్రీనివాస్ రెడ్డి స్మశానవాటిక మార్గంలో శివాలయం స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆ ఏరియా ఆస్పత్రికి తరలించారు విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోస్ట్ మార్టం నివేదికలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది