Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భగీరథ పైపుల లీకు.. ఊట పడుతున్న పొలాలు

ఏండ్లు గడుస్తున్నా రైతు గోస.. ఆల పించని మండల అధికారులు.

బురదమయంగా మారి బీ డైన తన వ్యవసాయ భూమి.

తుంగతుర్తి ,మార్చి 16, నిజం న్యూస్

రైతు భూమిలో నుండి వేసిన భగీరథ పైపులు. సంవత్సరాల తరబడి, లీకేజీల తో పంట నష్టం వాటిల్లడంతో, అధికారులకు తెలియజేసి నప్పటికీ, పట్టించుకోకపోవడంతో, లబోదిబోమంటున్న బాధిత రైతు, రిటైర్డ్ ఉద్యోగి ఎం డి జాన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

తుంగతుర్తి పట్టణానికి చెందిన వ్యవసాయ రైతు ఎండి జాన్ ,వెలుగు పెళ్లి రోడ్డుకు సర్వే నంబర్ 552.. 553 నా భూమిలోనుండి 3 సంవత్సరాల క్రితం భగీరథ త్రాగునీటి పైపులు వేయడం జరిగింది. ఆ పైపులు సరిగా నిర్మాణం చేపట్టకపోతే డంతో, నీరు వృధాగా లీకేజీ కావడంతో నా పొలములోని దుక్కి దున్ని నప్పుడు కిరాయి ట్రాక్టర్ తేవడంతో అందులో దిగ బడ డం తో చాలా ఖర్చు అవుతున్నాయని , ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఈ పైపుల వద్ద నేను జెసిబి కూడా తెచ్చి ఆ దిగబడిన ట్రాక్టర్ ను బయటికి తీయడం నాకు చాలా ఇబ్బంది కలుగుతుందని పేర్కొన్నారు. నా మూడున్నర ఎకరాల భూమిలో ఈ పైపులు రావడంతో నేను పంటలు పండించు కోకుండా ఈ పైపుల లీకేజీ తో ఈ సంవత్సరం పంటను వదులుకోవడం జరిగిందన్నారు నాకు ఈ భగీరథ పైపులు లీకేజీ కావడంతో చాలా నష్టం జరుగుతుందని ,నాకు ప్రతి కా రు 10 పుట్ల వడ్లు పండేవి .దాదాపుగా 50 క్వింటాలు నుండి 70 కింటా ల ల ధాన్యం పండేది . దీనితో లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, నాకు ఏ పంట వేయకుండా ఉండడంతో నష్టపరిహారం జరుగుతున్నది . గతంలో ఈ సంఘటనపై, అనేకమార్లు స్థానిక అధికారులు కలిసి అప్పటికీ ఫలితం లేకపోయిందని. కావున జిల్లా అధికారులు తక్షణమే ఈ పైపుల లీకేజీ లేకుండా సరిచేసి , తిరిగి పక్కనుండి పైపులైను వేయుటకు కృషిచేయాలని జిల్లా, మండల సంబంధిత అధికారులు న్యాయం చేయాలని, కోరు తున్నారు.