కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన ఫీల్డ్ అసిస్టెంట్లు ,టిఆర్ఎస్ నాయకులు

తుంగతుర్తి, మార్చి 16 ,నిజం న్యూస్.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లోకి తీసుకోవడం పట్ల ,సంతోషాన్ని వ్యక్తం చేస్తూ బుధవారం రోజున తుంగతుర్తి లో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఫీల్డ్ అసిస్టెంట్లు సంగం మండల అధ్యక్షులు గుడిపాటి కమలాకర్, రాచకొండ నాగరాజు, అరుణ, కరుణ, పద్మ, శ్రీలత, దేవా ఎల్లయ్య ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులు కెసిఆర్. చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాడికొండ సీతయ్య, కటకం వెంకటేశ్వర్లు, గుండ గాని రాములు గౌడ్, గ్రంథాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ గోపగాని శ్రీను, మల్లె పాక రాములు, తడకమళ్ల రవికుమార్, పులుసు వెంకట నారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.