Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి!

తుంగతుర్తి శాసనసభ్యులు, గాదరి కిషోర్ కుమార్.

తిరుమలగిరి, మార్చి 3, నిజం న్యూస్

తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ₹20 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు, తదనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘ఆయుష్ గ్రామ్’ కార్యక్రమంలో పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రజలు రోగాలతో ఇబ్బందులు పడుతున్నట్లు గ్రహించి, ప్రత్యేకంగా ఆయుష్ గ్రామ్ కార్యక్రమాన్ని ఆరోగ్య సిబ్బంది నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ అవకాశాన్ని పేద ప్రజలు సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలోకి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటా చలం, ప్రజా ప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.