గురుకుల సీట్లకు యమా క్రేజ్

పిల్లలు పరీక్ష కు …చెట్ల కింద నిద్రలో తల్లిదండ్రులు.
సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల సి ఓ ఈ సెట్ 2022 ప్రవేశ పరీక్షకు 400 మందికి గాను, 373 మంది ప్రవేశ పరీక్ష హాజరు కాగా, 23 మంది గైర్హాజరైన ట్లు ప్రిన్సిపాల్, ఎగ్జామ్ చీఫ్, వెంకటేశ్వర నాయక్ తెలిపారు. ఏది ఏమైనా కరుణ మహమ్మారి తో ,గ్రామాలు ,పట్టణాలు లోని తల్లిదండ్రులు ప్రైవేట్ కాలేజీలు ,పాఠశాలకు స్వస్తి చెప్పి ప్రభుత్వ పాఠశాలల వైపు వెళుతుండటం శుభపరిణామం. ప్రతి గురుకులంలో పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించుటకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు నిజం న్యూస్ తో ముచ్చటించారు.