Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బస్సు బోల్తా…ముగ్గురు మృతి..ఆరుగురికి గాయాలు

అనంతపురం జిల్లాలో తిరుమల నుంచి భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం పులగంపల్లి గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితులు తిరుపతికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై నల్లమాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.