కెసిఆర్ ను తిడితే, తెలంగాణ ప్రజలు బట్టలు ఊడ తీస్తారు…ఖబర్దార్

తుంగతుర్తి లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం.
తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్.
తుంగతుర్తి, ఫిబ్రవరి 16 నిజం న్యూస్
.సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో నియోజకవర్గ స్థాయి రక్తదానం కార్యక్రమంలో పాల్గొన్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్.అనంతరం తుంగతుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి మాట్లాడారు.
పనికిరాని కాంగ్రెస్ కమిటీకి పనికిమాలిన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.
. కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బట్టలు ఊడదీసి కొడుతుంది తెలంగాణ సమాజం.
మీ నాయకున్ని బీజేపీ ముఖ్యమంత్రి తిడితే సోయి లేదు కానీ ఈరోజు కేసీఆర్ ను పట్టుకుని అడ్డగోలుగా మాట్లాడుతున్నావ్.
నువ్వు నువ్వు ఎంత బ్లాక్ మెయిలర్ దొంగవు అందరికీ తెలుసు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మాట్లాడితే మంచిది.
తెలంగాణ జాతి బిడ్డను జాతిపితను పట్టుకొని నోటికొచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం బట్టలు ఊడదీసి కొడుతుంది కబడ్దార్ జాగ్రత్త బిడ్డ . అని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జి. యుగంధర్ రావు, టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ . శోభన్ బాబు, తిరుమలగిరి మున్సిపాలిటీ చైర్మన్ రాజాని, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య సోమేశ్వర్ గౌడ్ ఉప్పలయ్య యాకోబ్ రెడ్డి కందాల దామోదర్ రెడ్డి, ఎస్ ఏ రాజాక్, ఎంపీటీసీ చెరుకు సుజనా పరమేష్, మార్కెట్ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్, గుండ గాని రాములు గౌడ్, తునికి సాయిల్ గౌడ్, బీరప్పల నారాయణ, తడకమళ్ళ రవికుమార్, బొంకూరు గిరి, మా శెట్టి సోమయ్య, . డీప్ లా నాయక్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు నల్లు రాంచంద్రారెడ్డి, గడ్డం ఉప్పలయ్య, దుర్గయ్య, ముత్యాల వెంకన్న, కటకం సూరయ్య, గోపగాని రమేష్ గౌడ్, శ్రీను, బొంకురి నాగయ్య, సుమారు 70 మంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు