Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన:ఎన్ఎస్ యుఐ

తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి:చందన రెడ్డి

హైదరాబాద్ ఫిబ్రవరి9(నిజం న్యూస్):హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పార్లమెంటులో ప్రధానమంత్రి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ అమరవీరులను తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమాన పరుస్తూ, అవహేళన చేస్తూ మాట్లాడిన మాటలను ఖండిస్తూ.అందుకు నిరసనగా ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ,ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.