కోడి పుంజుకు టిక్కెట్ కొట్టిన కండక్టర్

బస్సులో ప్రయాణికులతో పాటు ప్రాణం ఉన్న జీవిని తీసుకెళ్లినట్లు అయితే టికెట్ తప్పనిసరి.. అవాక్కయిన ప్రయాణికుడు.
పెద్దపెల్లి , ఫిబ్రవరి 8 నిజాం న్యూస్.
గోదావరిఖని బస్టాండు నుండి కరీంనగర్ కు బస్సులో వెలుతున్న మహ్మద్ అలీ అనే ఓ ప్రయాణికుడు తన వెంట ఒక కోడిపుంజును తీసుకువచ్చాడు. అది గమణించిన బస్సు కండక్టర్ కోడి పుంజుకు కూడ టికెట్టు కొట్టాడు. దీంతో ఆశ్చర్యాణికి గురయ్యాడు సదురు ప్రయాణికుడు.దీనిపై కండక్టర్ ను వివరణ కోరగా ప్రయాణికుడి తో పాటు ఒక ప్రాణం తో ఉన్న జీవిని వెంట తీసుకొని వస్తే టిక్కెట్ తీసుకోవాలని వివరణ ఇచ్చాడు. దీంతో అవాక్కయిన ప్రయాణికుడు 30 రూపాయలు టికెట్ తీసుకోవడం గమనార్హం…