సూర్యాపేటలో గ్యాస్ బంకర్ పేలి ఇద్దరు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం!

లారీ డీజల్ ట్యాంకర్ పేలి
ఇద్దరు మృతి.ఇద్దరి కి తీవ్ర గాయాలు…
ఒక్కసారిగా ఉలిక్కి పడ్డ సూర్యా పేట….
సూర్యాపేట ఫిబ్రవరి 7 (నిజం న్యూస్ )
జిల్లా కేంద్రంలోని స్థానిక కొత్త బస్టాండ్ వద్ద డీజిల్ ట్యాంకర్ పేలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది.. లారీ డిజిల్ ట్యాంకర్ TS 07 UG 2718 వాలు బాక్స్ కి గ్యాస్ వెలిడింగ్ చేస్తుoడగా ప్రమాదవశాత్తూ ట్యాంకర్ పేలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారి లో సూర్యా పేట కురాయగాయల మార్కెట్ చెందిన పాల్వాయి అర్జున్(36) వెలిడింగ్ దుకాణ యజమాని ఇతనికి కుమార్తె, కుమారుడు కలరు. మునిసిపలిటి పరిధిలోని కుడకుడ కి చెందిన డ్రైవర్ గట్టు అర్జున్(45) ఇతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా పట్టణ సీఐ. జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు తరలించారు