Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఐసిసి అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ విజేత భారత్

ఐసిసి అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ 2022 ఫైనల్లో ఇంగ్లండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి  ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ విజేతగా నిలిచింది. గతంలో 2000, 2008, 2012, 2018లో గెలిచిన తర్వాత టోర్నమెంట్ చరిత్రలో భారత్‌కు ఇది ఐదవ అండర్-19 ప్రపంచ కప్ టైటిల్.

రాజ్ బావా (5/31), రవి కుమార్ (4/34)ల అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన తో  జేమ్స్ రెవ్ (95) ఫైటింగ్ ఫిఫ్టీ ఉన్నప్పటికీ 189 పరుగులకే ఇంగ్లండ్‌ను ఔట్ చేశాడు.  91-7 స్కోర్ తో ఉన్న ఇంగ్లాండ్ ను ఎనిమిదో వికెట్‌కు రెవ్ మరియు జేమ్స్ సేల్స్ కీలక భాగస్వామ్యం తో ఇంగ్లండ్‌ను పోటీ స్కోరుకు తీసుకువెళ్లింది.

ఇండియా బాటర్లు  షేక్ రషీద్ (84 బంతుల్లో 50), నిశాంత్ సింధు అర్ధశతకాలు బాదగా, రాజ్ బావా (54 బంతుల్లో 35) కూడా కీలక ధాటికి ఆడి భారత్ 47.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించడంలో సహకరించారు.

సంక్షిప్త స్కోర్లు: ఇంగ్లండ్ U-19: 44.5 ఓవర్లలో 189 ఆలౌట్ (జేమ్స్ రెవ్ 95, జేమ్స్ సేల్స్ 34; రాజ్ బావా 5/31, రవి కుమార్ 4/34) భారత్ చేతిలో ఓటమి: 47.4 ఓవర్లలో 195-6 (షేక్ రషీద్ 50, నిశాంత్ సింధు 50 ; జాషువా బోడెన్ 2/24) నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది .