Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం విప్లవాత్మక నిర్ణయం

సంగారెడ్డి/హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలన్న నిర్ణయం విప్లవాత్మకమని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు.  బీజేపీ నేతలు ఆంగ్ల మాధ్యమం ను  వ్యతిరేకించడం కార్పొరేట్‌ శక్తులకు అండగా ఉన్నారని మరోసారి రుజువు చేశారన్నారు. హైదరాబాద్‌ విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ, ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష నేతలపై రావు మండిపడ్డారు.

పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదవడం బీజేపీ నేతలకు ఇష్టం లేదా అని ఆయన ప్రశ్నించారు.  తెలంగాణలో ఉపాధ్యాయులు లేరన్న బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ఆరోపణలపై మంత్రి మాట్లాడుతూ  విద్యాహక్కు చట్టం ప్రకారం తెలంగాణలో తగినంత మంది ఉపాధ్యాయులు ఉన్నారని, వాస్తవానికి బిజెపి పాలిత రాష్ట్రాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరని, 21 నవోదయ పాఠశాలలను తెలంగాణకు తీసుకురావాలని బిజెపి చీఫ్‌ను డిమాండ్ చేసారు.

ప్రభుత్వం ‘దళిత బంధు’ అందిస్తుందని  మార్చి నాటికి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కనీసం 100 మంది లబ్ధిదారులకు ప్రయోజనం ఉంటుదని తెలిపారు.  ఈ పథకానికి అవసరమైన నిధులు ఇప్పటికే జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ అయ్యాయి.. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని తెలిపారు.  ఈ పథకం హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే అని ఆరోపించిన వారు ఇప్పుడు చెప్పండన్నారు. రైతు బంధులాగా దేశంలో దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని టీఆర్‌ఎస్ అధినేత బీజేపీని డిమాండ్ చేశారు.కేంద్ర ఆర్థిక మంత్రిని సీతారామన్‌ దళితుల అభ్యున్నతికి నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు.