Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జంటనగరాల అభివృద్ధిని విస్మరించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్: జంటనగరాల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే ఎం. రఘునందన్‌రావు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. జంటనగరాల అభివృద్ధి అంశంపై పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో చర్చకు సిద్ధమన్నారు. బాలానగర్ డివిజన్ ఇందిరానగర్ కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందిరా నగర్‌ నివాసితులకు 30 ఏళ్లు గడుస్తున్నా జీహెచ్‌ఎంసీ అధికారులు ఇంటి నంబర్లు కేటాయించలేదని ఆరోపించారు. లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మిస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారని, ఆ మాట నుంచి కేసీఆర్‌ వెనక్కి తగ్గారని ఆరోపించారు.