Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఇన్‌స్పెక్టర్ లైంగికంగా వేధించాడని కమిషనర్ ఫిర్యాదు

బెంగళూరు: హెన్నూరు పోలీస్ ఇన్‌స్పెక్టర్ వసంత్ కుమార్ ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తనను లైంగికంగా వేధించారని బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ కమల్ పంత్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనపై దాడికి యత్నించిన అద్దె కు ఉంటున్న వారిపై  ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా ఇన్‌స్పెక్టర్‌ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించింది. ఇన్‌స్పెక్టర్ అద్దెదారుల పక్షాన నిలిచారని, తనపై కౌంటర్ ఫిర్యాదు చేయాలని కోరారని ఆమె ఆరోపించింది. తనపై నమోదైన అట్రాసిటీ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ తనను పదే పదే పోలీస్ స్టేషన్‌కు పిలిపించి,  “ఇన్‌స్పెక్టర్ నన్ను తన గదిలోకి పిలిచి, నా చేయి పట్టుకుని లాగాడు. అతను తన కోరికను తీర్చమని అడిగాడని,   అతను తనను పిలిచినప్పుడల్లా వచ్చి నన్ను కలవాలని డిమాండ్ చేశాడు” అని ఆమె నగర పోలీసు కమిషనర్‌కు చేసిన ఫిర్యాదులో ఆరోపించింది.
శక్తినగర్‌లోని తన ఇంటిని వరలక్ష్మి అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చానని, రూ.7 లక్షలు అద్దెకు తీసుకున్నానని చెప్పింది. ‘‘వరలక్ష్మి కుటుంబం ఏడాదిగా నీటి బిల్లు చెల్లించలేదు. నీటి బిల్లు ఎందుకు చెల్లించడం లేదని అడగడానికి  జనవరి 13న వెళ్లినప్పుడు నాపై దాడి చేశారని తెలిపారు. కత్తితో పొడిచి తప్పించుకుని కేసీ జనరల్‌లో చికిత్స చేయించుకున్నారని తెలిపింది.  ఇన్‌స్పెక్టర్ వసంత్ నన్ను దుర్భాషలాడడంతో  హెన్నూరు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.