ఏడు అరుదైన జాతుల రాబందులతో స్మగ్లర్ అరెస్ట్

మధ్యప్రదేశ్లోని ఖాండ్వా రైల్వే స్టేషన్లో రాబందుల స్మగ్లర్ను అరెస్టు చేశారు. స్మగ్లర్ నుండి అంతరించిపోయిన జాతికి చెందిన ఏడు రాబందులను స్వాదీనం చేసుకున్నారు.
రైలులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు దుర్వాసన రావడంతో టికెట్ ఇన్స్పెక్టర్కు సమాచారం అందించాడు. రైలు ఖాండ్వా రైల్వే స్టేషన్కు చేరుకోగానే టికెట్ ఇన్స్పెక్టర్ ఆర్పీఎఫ్కి సమాచారం అందించారు.
ఖాండ్వా రైల్వే స్టేషన్లో ఆర్పిఎఫ్ మరియు అటవీ శాఖ సంయుక్త విచారణలో నిందితుడిని అరెస్టు చేశారు. ఈ రాబందులు ఈజిప్షియన్ రాబందు అనే అరుదైన జాతికి చెందినవని గుర్తించారు.
“రైలులో ఒక వ్యక్తి తెల్ల రాబందులు తీసుకెళ్తున్నట్లు మాకు RPF నుండి సమాచారం వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని రైలుపై సంయుక్తంగా దాడి చేశారు. ఏడు తెల్ల రాబందులు లేదా ఈజిప్టు రాబందులు స్వాధీనం చేసుకుని నిందితుడు ఫరీద్ అహ్మద్ను అరెస్టు చేశారు. అతని మీద వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 కింద కేసు నమోదు చేయబడింది” అని అటవీ శాఖ SDO, RS సోలంకి తెలిపారు.
నిందితుడిని వివరాల కోసం ప్రశ్నిస్తున్నామని, కోర్టు అనుమతి పొందిన తర్వాత రాబందులు బహిరంగంగా విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
రాబందులను యూపీలోని కాన్పూర్ నుంచి మహారాష్ట్రలోని మాలెగావ్కు తరలిస్తున్నారు. మధ్యప్రదేశ్లో రాబందులు అక్రమ రవాణా జరగడం ఇదే తొలిసారి. రాబందులన్నింటినీ అటవీశాఖకు అప్పగించారు.