క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి..ఎంఎల్ఏ బొల్లం
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి
రెపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయి
ప్రతి ఒక్కరు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
క్రీడలలో ప్రతి ఒక్కరు రాణించాలి అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.గురువారం కోదాడ మండలం గుడిబండ గ్రామంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు మాట్లాడుతూ…….క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి అని ఆయన అన్నారు.రెపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయి అని ఆయన అన్నారు.విద్యార్థులు చదువుతోపాటు క్రీడాలలో రాణించాలని అన్నారు.ప్రతి ఒక్కరు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి అని ఆయన కోరారు.క్రీడాకారులకు, కళాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. అలాగే క్రీడలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.త్వరలో కోదాడలో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత రాధా రెడ్డి, జడ్పీటీసీ కృష్ణకుమారి శేషు,నాయకులు , శెట్టిసురేష్,నాగిరెడ్డి, ,సలీం,గీత,బిక్షం,శేషు,అప్పలకొండ,నాగరాజు, శ్రీను, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.