Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

24 గంటల్లో 620 ఒమిక్రాన్ కేసులు నమోదు

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో ఇప్పటి వరకు 620 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి,  దీంతో దేశంలో ఓమిక్రాన్ కేస్ లు  5,488కి చేరుకున్నాయి.

గత 24 గంటల్లో 2,162 మంది ఓమిక్రాన్ రోగులు కోలుకున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఒమిక్రాన్ లో 1,367 కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతుండగా, రాజస్థాన్ 792, ఢిల్లీ 549, కేరళ 486 , కర్ణాటక 479 లు  తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

భారతదేశంలో, 2,47,417 కొత్త కరోనా వైరస్ కేస్ లు నమోదు కాగా , గడిచిన  236 రోజులలో అత్యధికం, మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 3,63,17,927 కు చేరుకుంది.

క్రియాశీల కేసులు 11,17,531కి పెరిగాయి, ఇది 216 రోజులలో అత్యధికం, మరణాల సంఖ్య 380 తో 4,85,035 కు చేరుకుంది.