సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కరోనా

టాలీవుడ్ లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ కొవిడ్ మహమ్మారి బారినపడ్డారు. ఆయనకు కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని వెల్లడైంది. హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. రాజేంద్రప్రసాద్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని డాక్టర్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరంలేదని పేర్కొన్నారు. టాలీవుడ్ లో ఇటీవల మహేశ్ బాబు, తమన్, మంచు లక్ష్మి వంటి ప్రముఖులు కరోనా బారినపడ్డారు.