సంక్రాంతి పండగవేళ కరోనా బెంగ

పట్టణాల నుంచి వచ్చే వారితో వ్యాప్తికి అవకాశం
హైదరాబాద్ నుంచి వచ్చే వారితోనే ఎక్కువ ప్రమాదం
తెలుగు రాష్టాల్ల్రో అతిపెద్ద పండగ అయిన సంక్రాంతికి ప్రజలు అటూఇటూ పరుగెడుతున్నారు. ఇక్కడి వారు అక్కడికి..అక్కడి వారు ఇక్కడికి చేరుకుంటున్నారు. పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. పండగ నాలుగురోజులు ఆనందం గడపాలను కుంటున్న వారికి కరోనా హెచ్చరికలు కానరావడం లేదు. యధావిధిగా బస్సుల్లో రైళ్లల్లో గుంపులుగా బయలుదేరుతున్నారు. ఏ మాత్రం లక్షణాలున్నా ప్రయాణాలు వద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత మేర పండుగ ప్రయాణాలు తగ్గించుకోవాలన సూచిస్తున్నారు. ఇప్పటికే ఒమైక్రాన్ జనంలోకి వెళ్లిపో యింది.
రోజుల వ్యవధిలోనే వందల్లో కేసులు రెట్టింపు అవుతున్నాయి. మరోవైపు కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి,. ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. తప్పనిసరిగా ప్రయాణాలు చేయాల్సివస్తే మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి చేసుకోవాలన్నారు. ఏమాత్రం లక్షణాలున్నా ప్రయాణాలు మంచిది కాదని, ఇంటికే పరిమితం కావాలంటున్నాఈ క్రమంలో కానీ సంబరంగా జరుపుకొనే సంక్రాంతి ముంగిట.. కరోనా ముప్పు కలవరపరుస్తోంది.
పండుగకు నగరం నుంచి ఊరెళ్లాలనుకున్న వారి ద్వారా వైరస్ వ్యాప్తి ప్రమాదం ఉంటుందని అంటున్నారు. వీరి నుంచి గ్రామాలకూ పాకుతుందేమోనన్న భయాలు వ్యక్తం అవుతున్నాయి. లక్షల మంది వెళ్లి, రానున్న నేపథ్యంలో పరిస్థితి ఎక్కడకు దారి తీస్తుందోనని తీవ్ర ఆందోళన కలుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 60 శాతం పైగా హైదరాబాద్వే కావడం… ఇక్కడి నుంచే గ్రామాలకు వెళ్లడం మరింత ఆందోళనకు దారితీస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. 75శాతం పాజిటివ్ కేసులన్నీ రాజధాని పరిసర ప్రాంతాలవే నని స్పష్టమవుతోంది.
హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో 5 రోజుల్లో 5 వేలకు పైగా కేసులు వచ్చాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి, ఉద్యోగాలకు వచ్చినవారు ’గ్రేటర్’ పరిధిలోని ఈ జిల్లాల్లోనే ఉంటారు. కాగా, ఒమైక్రాన్ జనంలోకి వెళ్లిపోయిందని.. ప్రస్తుత కేసుల్లో 70 శాతం ఈ వేరియంట్ వేనని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఒమైక్రాన్ గ్రేటర్ జిల్లాలకే ఎక్కువగా పరిమితమైంది. మరోవైపు గ్రామాల్లో ఎక్కువగా 45 ఏళ్లు పైబడినవారు, వృద్ధులే ఉంటున్నారు. విద్య, ఉపాధి కోసం నగరంలో ఉంటున్న యువత సెలవులతో పల్లెబాట పట్టడంతో అక్కడా వ్యాపించే ముప్పుంది. ఇలాంటి సందర్భంలోనే సంక్రాంతి సెలవులకు ప్రయాణాలు ప్రారంభమవుతుండడం ఉలికిపాటుకు గురిచేస్తోంది.
పండుగ సెలవులు రావడంతో ఏటా మాదిరిగానే నగరవాసులంతా పల్లె బాట పడుతున్నారు. వీరి సంఖ్య 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉంటుందని అంచనా. వీరి అజాగ్రత్తల కారణంగా వైర్సను కూడా మోసుకెళ్లే ముప్పు కనిపిస్తోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది..క్రిస్మ్మస్, డిసెంబరు 31 నాటి ప్రభావం నాలుగైదు రోజుల్లోనే కనిపించింది. సంక్రాంతి అనంతరం పల్లెల్లోనూ భారీగా కేసులు వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ అంచనాతో వేస్తోంది.
మళ్లీ వైరస్ అంటుకుంటే..వైద్య సౌకర్యాలు తక్కువగా ఉండే గ్రావిూణ ప్రాంతాల్లో కొవిడ్ మొదటి, రెండో వేవ్లలో సరైన చికిత్స అందక వేలమంది మరణించారు. అయితే, వ్యాక్సినేషన్ బాగా జరిగినందున థర్డ్ వేవ్లో ఆస్పత్రుల పాలయ్యేవారు తక్కువగా ఉంటారని చెబుతున్నా.. పెద్దసంఖ్యలో కేసులోస్తే కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యాక్సిన్ వేసుకున్న వారు కూడా కరోనా బారిన పడి మరణించిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే వరంగల్ నిట్లో ప్రొఫెసర్, ఆడ్మినిస్టేష్రన్ సిబ్బంది ఒకరికి కరోనా సోకింది. దీంతో ఫ్యాకల్టీ, ఉద్యోగులకు ఇంటినుంచి పని చేయాలని ఆదేశాలు ఇచ్చారు. శుక్రవారం 500మంది విద్యార్థులు క్యాంపస్ నుంచి వెళ్లిపోయారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన వ్యక్తికి, ఎల్లారెడ్డికి చెందిన ప్రవాస భారతీయుడి కుటుంబంలో ఒకరికి ఒమైక్రాన్ నిర్దారణ అయింది. ఎన్ఆర్ఐకి అంతకుముందే ఒమైక్రాన్ సోకినట్లు తేలింది. అలాగే హైదరాబాద్లోని పలు విద్యాసంస్థల్లో విద్యార్థులు,ఫ్యాకల్టీలకు కూడా కరోనా వచ్చిన ఉదాహరణలు ఉన్నాయి. ఈ క్రమంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.