Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

 దేశంలో 781కి చేరిన ఒమిక్రాన్‌ కేసులు

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు

 781కి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి

అత్యధికంగా ఢల్లీిలో 238 ఒమిక్రాన్‌ కేసులు నమోదు

మరోమారు తీవ్రంగా కరోనా కేసుల పెరుగుదల

అప్రమత్తంగా ఉండాలన్న వైద్యారోగ్య శాఖ

దేశంలో రోజురోజుకు ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు కరోనా కేసుల సంఖ్యకూడా అనూహ్యంగా పెరుగుతోంది. తాజాగా పెరుగుతున్న కేసులు ఆందోలన కలిగిస్తున్నాయి. బుధవారం ఉదయానికి దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 781కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడి౦చింది.

మంగళ వారం ఒక్కరోజే 127 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 241మంది కోలుకున్నారని తెలిపింది. అత్యధికంగా ఢల్లీిలో 238 ఒమిక్రాన్‌ కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 167 కేరళలో 65, తెలంగాణ లో 62, గుజరాత్‌లో 73, రాజస్థాన్‌లో 46, తమిళనాడులో 34, కర్నాటకలో 34, ఆంధప్రదేశ్‌లో 6 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ కేసులు మొత్తం 781 కాగా రికవరీ అయి డిశ్చార్జ్‌ అయిన వారు 241మంది ఉన్నారు.

మరోవైపు దేశంలో క్రమంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో మొత్తం 781 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని  ఢిల్లీ లో  అత్యధికంగా 238 కేసులు నమోదు కావడంతో ఆందోళన కలుగుతోంది. కోవిడ్‌ కేసులు కంటే ఈ రోజు 44 శాతం ఎక్కువ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.

రాష్టాల్ర వారీగా నమోదవుతున్న ఒమిక్రాన్‌ కేసులు ఇలా వున్నాయి. ఢిల్లీ లో 238 కేసులు..నమోదు కాగా రికవరీ అయినవారు 57గా నమోదయ్యారు. మహారాష్ట్రలో 167 కేసులకు  72మంది రికవరీ అయ్యారు. గుజరాత్‌లో 73 కేసులకు రికవరీ అయినవారు 17మంది ఉన్నారు. కేరళలో 65 కేసులు నమోదు కాగా రికవరీ అయినవారు ఒకరుగా ఉన్నారు. తెలంగాణ లో 62 కేసులు నమోదు కాగా రికవరీ అయినవారు 10మంది, రాజస్తాన్‌లో 46 కేసులకు రికవరీ అయిన వారు 30మంది, కర్నాటకలో 34 కేసులకు రికవరీ అయినవారు 18మంది, తమిళనాడులో 34 కేసులకు రికవరీ అయినవారు 16మంది, హర్యానాలో 12 కేసులకు రికవరీ అయినవారు ఇద్దరు ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌ 11 కేసుల్లో ఓక్కరు రికవరీ అయ్యారు.

ఒమిక్రాన్‌ కేసుల తీవ్రత నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆంక్షలు అమలవుతున్నాయి. జనవరి 31వరకూ ఆంక్షలు అమలులో వుంటాయి. అంతర్జాతీయంగా వచ్చే ప్రయాణికులకు కఠినమైన స్క్రీనింగ్‌ చెయ్యాలని, ఆర్టిపిసిఆర్‌ పరీక్షలను నిర్వహించాలని కేంద్రం సిఫార్సు చేసింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం అంతర్జాతీయ ప్రయాణికుల పరిచయాలను నిశితంగా ట్రాక్‌ చేసి పరీక్షించాలి. పాజిటివ్‌గా మారిన ప్రయాణికుల నమూనాలను వెంటనే జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ లాబొరేటరీలకు పంపాలని కేంద్రం రాష్టాల్రకు సూచించింది.

ఇకపోతే  దేశంలో కోవిడ్‌ ముప్పు తొలగడం లేదు. గత కొంతకాలంగా తక్కువగా నమోదవు తున్న కేసులు తిరిగి పెరగడం ప్రారంభించాయి. క్రమంగా పెరుగుతున్న కోవిడ్‌ కేసులు ఆందోళన పెంచు తున్నాయి. దేశంలో మహమ్మారి కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 9,195 కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదయ్యా యని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడి౦చింది.

దీంతో మంగళవారం నాటికంటే 44 శాతం అధికంగా కేసులు పెరిగాయి. కరోనాతో మరో 302మంది బాధితులు మృతిచెందారని తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.47కోట్లు దాటింది. ఇక కరోనా బారిన పడి ఇప్పటివరకు దేశంలో 4,80,592మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 7,347మంది కోలుకోగా.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3.42కోట్లకు పైగా మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 77,002. కరోనా యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో రికవరీ రేటు 98.40 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు 143.15 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది. తాజాగా 9195 కరోనా కేసులు నమోద య్యాయి.

ఇందులో యాక్టివ్‌ కేసులు 77,002 వున్నాయి. ఒమిక్రాన్‌ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీ లో కరోనా రూల్స్‌ నిబంధనలను కఠినతరం చేశారు. ఎల్లో అలర్ట్‌ విధించిన కేజీవ్రాల్‌ సర్కారు.. మెట్రోతోపాటు బస్సులను 50 శాతం కెపాసిటీతో నడిపించాలని నిర్ణయించింది. మెట్రోల్లో నిల్చుని ప్రయాణించేందుకు కూడా అనుమతి నిరాకరించారు.