ఒక్క వికెట్ దూరంలో నిలిచిన భారత్ విజయం

డ్రాగా ముగిసిన కాన్పూర్ తొలి టెస్ట్
ఒక్క వికెట్ దూరంలో నిలిచిన విజయం
చవిరి వరకూ శ్రమించినా దక్కని ఆఖరి విక్కెట్
భారత్ విజయాన్ని అడ్డుకున్న రచిన్ రవీంద్ర ,అజాజ్ పటేల్
కాన్పూరులో భారత్`న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలిటెస్ట్ డ్రా గా ముగిసింది. చివరి రోజు బౌలర్లు పూర్తిగా శ్రమించి న్పటికీ ఒక్క వికెట్ దూరంలో విజయం చేజారింది. ఎంతో శ్రమించినా చివరి వికెట్ తీయలేకపోయారు. దీంతో టెస్ట్ డ్రాగా ముగిసింది.
టీ20 క్రికెట్లోనే మజా ఉంటుందనుకునే వారికి కనువిప్పు కలిగిస్తూ.. చివరి గంటసేపు టెన్షన్తో విలవిల్లాడేలా కివీస్, భారత్ తొలి టెస్టు సాగింది. భారత విజయానికి 10 వికెట్లు కావల్సిన తరుణంలో స్పిన్నర్లు చెలరేగారు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ భారత విజయానికి బాటలు వేశారు. కానీ చివరకు ఒకే ఒక్క వికెట్ తీయలేక మ్యాచ్ను డ్రాగా ముగించాల్సి వచ్చింది. ఈ క్రెడిట్ మొత్తం కివీ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (90 బంతుల్లో 18 నాటౌట్), అజాజ్ పటేల్ (23 బంతుల్లో 2)కే దక్కుతుంది. వీళ్లిద్దరూ ఎటువంటి అనవసరమైన షాట్లకు వెళ్లకుండా. మ్యాచ్ను డ్రా చేయడమే తమ లక్ష్యంగా ఆడారు.
రెండో ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. చివరగా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ రచిన రవీంద్ర, అజాజ్ పటేల్ భారత్ విజయాన్ని అడ్డు కున్నారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇన్నింగ్స్ చివర్లో భారత బౌలర్లు ఓవర్ వేయడానికి వచ్చిన ప్రతిసారీ.. అంపైర్ నితిన్ విూనన్ లైటింగ్ చెక్ చేస్తూ మరింత ఉత్కంఠ పెంచాడు. ఒక్క వికెట్ పడగొడితే విజయం భారత వశం అవుతుందనే సమయంలో.. నితిన్ విూనన్ లైట్ చెక్ చేయడం అభిమానుల్లో మరింత టెన్షన్ పెంచింది. అయితే చివరకు పూర్తి కోటా ఓవర్లు వేసినా.. రచిన్, పటేల్ జోడీ భారత విజయాన్ని అడ్డుకుంది. ఐదో రోజు బ్యాటింగ్ చేపట్టిన న్యూజిలాండ్ పేలవంగా ఆడి౦ది. ఓపెనర్ టామ్ లాథన్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేసి పర్వాలేదనిపించాడు. 52 పరుగులు చేసి జట్టుకి గౌరవప్రదమైన స్కోరుని అందించాడు. విలియమ్ సోమర్ విల్లే 36 పరుగులు, కెప్టెన్ కేన్ విలియమ్సన్ 24 పరుగులు చేశారు. క్రీజులో నిలదొక్కుకోవడానికి నానా తంటాలు పడ్డారు. వీరు మినహాయించి మిగతా వారు ఎవ్వరూ పెద్దగా రాణించలేదు.
ఇక భారత బౌలర్లు ఆది నుంచి తమ ప్రతాపం చూపించారు. ఓవర్లు మెయిడన్ చేస్తూ పరుగులు రాకుండా కట్టడి చేశారు. వరుసగా వికెట్లు సాధించారు. రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు, రవీంద్ర జడేజా 4 వికెట్లు, అక్సర్ పటేల్ 1 వికెట్, ఉమేశ్ యాదవ్ 1 వికెట్ సాధించారు.
నాలుగో రోజు భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 234 పరుగుల వద్ద డిక్లేర్ ప్రకటించింది. దీంతో మూడోరోజు 63 పరుగుల ఆధిక్యంతో కలిపి కివీస్కి 284 పరుగుల టార్గెట్ని నిర్దేశించింది. తొలిటెస్ట్ ఆడిన శ్రేయాస్ అయ్యార్ మొదటి ఇన్నింగ్స్లో సెంచరీ చేయగా.. రెండో ఇన్నింగ్స్లో కూడా క్లాసిక్ ఆటతో అలరించాడు. రవిచంద్రన్ అశ్విన్తో కలిసి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 65 (ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన వృద్దిమాన్ సాహా కూడా చెలరేగి పోయాడు. హాప్ సెంచరీ చేసి అదరగొట్టాడు. 61 (నాలుగు ఫోర్లు, ఒక సిక్స్) పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అక్సర్ పటేల్ 28 పరుగులతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
దీంతో ఉత్కంఠభరితంగా సాగిన తొలి టెస్టు చివరిరోజున కివీస్ 165/9తో మ్యాచ్ను డ్రాగా ముగించింది. భారత స్పిన్ దాడిని ఎదుర్కొంటూ జట్టు ఓటమికి అడ్డుకట్ట వేశారు. దీంతో భారత్`న్యూజిల్యాండ్ తొలి టెస్టు డ్రాగా ముగిసింది.