నెట్ ప్రాక్టీస్లో ద్రవిడ్ సూచనలు

నెట్ ప్రాక్టీస్లో మెళకువలు
భారత్ ఆటగాళ్లకు ద్రవిడ్ సూచనలు
న్యూజిలాండ్తో తొలి టెస్టుకు ముందు టీంఇండియా ఆటగాళ్లు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆధ్వర్యంలో నెట్స్లో ప్రాక్టీస్ చేశారు. అజింక్యా రహానే నేతృత్వంలో భారత ఆటగాళ్లు కాన్పూర్లోని గ్రీన్ పార్క్లో ప్రాక్టీస్ సెషన్?లో పాల్గొన్నారు. ఆటగాళ్ల ప్రాక్టీస్?ను కోచ్ రాహుల్ ద్రవిడ్ నిశితంగా పరిశీలించాడు. నవంబర్ 25 నుండి ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్కు సన్నద్ధమవుతున్న తరుణంలో ఛెటేశ్వర పుజారా, ఇతర సీనియర్ బ్యాటర్లకు ద్రవిడ్ కొన్న సూచనలు చేశాడు. జయంత్ యాదవ్తో పాటు ఇషాంత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ నెట్స్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశారు. కేఎల్ రాహుల్ టెస్టు సిరీస్కు దూరం అవడంతో సూర్యకుమార్ను జట్టులోకి తీసుకున్నారు. రాహుల్ ద్రవిడ్ కూడా నెట్స్ వద్ద సూర్యకుమార్ యాదవ్కు పలు సూచనలు చేశాడు. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, జస్పీత్ర్ బుమ్రా, మహ్మద్ షవిూతో పాటు విరాట్ కోహ్లీ మొదటి టెస్ట్కు దూరమవడంతో భారత్లో చాలా మంది కీలక ఆటగాళ్లు లేకుండా పోయారు. రాహుల్ గాయంతో తప్పుకోవటంతో శుభ్మన్ గిల్, మయాంక్ అగర్వాల్తో కలిసి భారత్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.