మూడు రాజధానుల బిల్లులు ఉపసంహరణ
ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరాలుగా నలుగుతున్న మూడు రాజధానుల బిల్లు ను ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ సోమవారం తెలిపారు . మూడు రాజధానులు అంశంపై ఏపీ హైకోర్టులో గత కొద్దిరోజులుగా జరుగుతున్న విచారణ నేటి వాదోపవాదాల్లో భాగంగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపిన అడ్వకేట్ జనరల్ . ఇదే అంశంపై ఏపీ సచివాలయంలో అత్యవసర కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందో అన్న అంశంపై రాష్ట్రంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.