Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రోహిత్‌, ద్రవిడ్‌ నేతృత్వంలో ప్రపంచకప్‌ గెలుస్తుంది…గంభీర్‌

రోహిత్‌, ద్రవిడ్‌ నేతృత్వంలో భారత్‌ కచ్చితంగా వచ్చే ప్రపంచకప్‌ గెలుస్తుంది

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌

టీ20 ప్రపంచకప్‌ లో టీమ్‌ఇండియా సెమీస్‌ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. దీంతో భారత జట్టుపై పలు విమర్శలు వస్తున్నాయి. అలాగే 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిచాక.. ఇప్పటివరకు మళ్లీ ఐసీసీ టోర్నీలో విజయం సాధించలేదు భారత్‌. కెప్టెన్‌?గా కోహ్లీ, కోచ్‌?గా రవిశాస్త్రి కాంబినేషన్‌?లో ఒక్క మెగాటోర్నీ కూడా గెలవలేకపోయింది. ఈ విషయంపై స్పందించిన టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌.. రోహిత్‌ కెప్టెన్సీ, రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌?గా భారత్‌ కచ్చితంగా వచ్చే ప్రపంచకప్‌ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కెప్టెన్‌?గా రోహిత్‌, కోచ్‌?గా ద్రవిడ్‌ ఈ ఫార్మాట్‌?లో జట్టును మరింత ముందుకు తీసుకువెళతారని అనుకుంటున్నా. అలాగే ప్రపంచకప్‌? టైటిల్‌? కూడా వీరు సాధిస్తారని నమ్ముతున్నానని’ వెల్లడిరచాడు గంభీర్‌. ఈ ప్రపంచకప్‌ లో భాగంగా సోమవారం (నవంబర్‌ 8) నమీబియాతో జరిగే మ్యాచ్‌? ఇటు కోచ్‌?గా రవిశాస్త్రికి, టీ20 కెప్టెన్‌?గా కోహ్లీకి చివరిది. దీంతో ఈ మ్యాచ్‌?లో ఘన విజయం సాధించి వీరిద్దరికి గొప్ప వీడ్కోలు పలకాలని యాజమాన్యం భావిస్తోంది.