Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉగాది కానుకగా రానున్న సర్కారువారి పాట

సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు తాజా చిత్రం ’సర్కారువారి పాట’ పరశురామ్‌ దర్శకత్వంలో ప్రస్తుతుం సెట్స్‌ పై ఉంది. ఇటీవల ఈ సినిమా స్పెయిన్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.  కీర్తి సురేశ్‌ కథానాయికగా నటిస్తున్న ఈ మూవీని ఇప్పుడు సంక్రాంతి రేసులోంచి తప్పించడం టాలీవుడ్‌ లో హాట్‌ టాపిక్‌ గా మారింది. అయితే ఈ సినిమాను వచ్చే ఏడాది ఉగాది కానుకగా ఏప్రిల్‌ 1న విడుదల చేయబోతున్నట్టు ట్విట్టర్‌ వేదికగా నిర్మాతలు ప్రకటించారు. వచ్చే ఏడాది సమ్మర్‌కు రాబోతోన్నపెద్ద చిత్రం ఇదే. ఈ సినిమాకు వేసవి సెలవులు కలిసి రానున్నాయి. హాలీడే సీజన్‌ లో విడుదలైన మహేష్‌ బాబు  పోకిరి, భరత్‌ అనే నేను, మహర్షి వంటి చిత్రాలు బ్లాక్‌ బస్టర్స్‌ గా నిలిచాయి. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రయూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలను వేగవంతం చేయనుంది.

మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంట్టంల్గªన్మెంట్‌, 14 రీల్స్‌ ప్లస్‌ బ్యానర్‌ల విూద నవీన్‌ యెర్నేని, వై రవి శంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట సంయుక్తంగా  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇందులో సముద్రఖని విలన్‌ గా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇతర పాత్రల్లో

సుబ్బరాజు, వెన్నెల కిశోర్‌ నటిస్తున్నారు. బ్యాంకింగ్‌ స్కామ్‌ నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందుతోన్న ఈ సినిమా మహేశ్‌ బాబు కు ఏ రేంజ్‌ లో సక్సెస్‌ అందిస్తుందో చూడాలి.