Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎవడు బ్రో నీకు చెప్పింది…రానా

దగ్గు బాటి రానాసోషల్‌ విూడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. అప్పుడప్పుడు తనపై వచ్చే విమర్శలకు

ఘాటుగా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆయన నటించిన ’విరాట పర్వం’ సినిమాకి సంబంధించి ఓ వెబ్‌ సైట్‌ కథనం రాసింది. ఈ సినిమా నుండి మ్యూజిక్‌ డైరెక్టర్‌ సురేష్‌ బొబ్బిలి తప్పుకున్నాడంటూ పబ్లిష్‌ చేయగా, దానికి రిప్లై ఇచ్చిన రానా .. ’ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది’ అంటూ చేసాడు. ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం ఏప్రిల్‌ 30న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేసారు. డిసెంబర్‌లో చిత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది.వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్ర ఫస్ట్‌ లుక్‌, టీజర్‌, ట్రైలర్‌లు అద్భుతమైన రెస్పాన్స్‌ రాబట్టడటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రంలో రానా నక్సలైట్‌గా కనిపించబోతున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ డి.సురేష్‌ బాబు సమర్పణలో ఎస్‌.ఎల్‌.వి.సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.