Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నేడు ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి సస్పెన్స్‌ న్యూస్‌

ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న ’ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ నుంచి ఊహకందని సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నారు రాజమౌళి టీమ్‌. ఆయన దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌లు హీరోలుగా కలిసి నటిస్తున్న పాన్‌ ఇండియన్‌ మూవీ ’రౌద్రం రణం రుధిరం’. ఈ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ’ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రమోషన్స్‌ను భారీ స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా మేకర్స్‌ ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ను రివీల్‌ చేశారు. ’ఈ అక్టోబర్‌ 29న శుక్రవారం ప్రపంచంలోని ఏ చిత్రానికి ఇంతకు ముందెన్నడూ చూడని, వినని కొలాబరేషన్‌ను చూడటానికి సిద్ధంగా ఉండండి’.. అని రాజమౌళి టీమ్‌ ట్వీట్‌ చేసింది. దాంతో వీరు ఇవ్వబోతున్న అప్‌డేట్‌ ఏంతో అనే ఆసక్తితో అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ 10 భాషలలో రిలీజ్‌ కానుంది. బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ ఆలియా భట్‌, బ్రిటన్‌ మోడల్‌ ఓలివియా మోరీస్‌, అజయ్‌ దేవగణ్‌, శ్రియ శరణ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు.