Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం జడ్పీటీసీ పొశం నర్సింహారావు గడువు ముగుస్తుండడంతో విస్తృతంగా ఓటరు నమోదు ప్రక్రియ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు మండలం లో త్వరలో జరగబోయేటువంటి ఖమ్మం,వరంగల్,నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువు రేపటితో ముగుస్తుండడంతో గురువారం జడ్పీటీసీ పొశం నర్సింహారావు మండలం లోని పంచాయితీ మరియు వార్డుల లో విస్తృతంగా ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టారు.అందులో భాగంగా గురువారం మణుగూరు మండలం లోని కూనవరం గ్రామ పంచాయతీ లో గల సింగరేణి ఏరియా హాస్పిటల్ లోని డాక్టర్లు,నర్సులు మరియు సిబ్బంది కి ఎమ్మెల్సీ ఓటు పట్ల అవగాహన కల్పిస్తూ వారికి ఓటరు నమోదుకు ఫామ్-18 పత్రాలను అందజేస్తున్న జడ్పీటీసీ పొశం నర్సింహారావు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, డాక్టర్ శేషగిరిరావు,టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు,మండల అధ్యక్షులు ముత్యం బాబు,కూనవరం సర్పంచ్, మరియు సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షులు ఏనిక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.