Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఖమ్మం, వరంగల్, నల్లగొండ, “పట్టభద్రుల ఎమ్మెల్సీ “ఎన్నికల సమీక్ష సమావేశం…

స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టభద్రుల “ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షా” సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, హాజరయ్యారు. మండలంలో పట్టభద్రుల ఓటర్ నమోదు ప్రక్రియ గురించి బాధ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్కువ సమయం ఉన్నందున గ్రామాలలో మిగిలిన పట్టభద్రుల ఓట్ల నమోదు వేగవంతం చేసి అందరిని చేర్పించాలి కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోనీ, సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డి, ఎంపీటీసీలు పెండ్యాల రాజశేఖర్, దుద్దుకూరు మధుసూదనరావు , సర్పంచ్ కిషన్ లాల్, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నర్సింహారావు, రామిశెట్టి రాంబాబు, యదళ్ళపల్లి వీరభద్రం, నర్వనేని పుల్లారావు, లేళ్ల గోపాల్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ జవహర్ లాల్ దితరులు పాల్గొన్నారు.