*పురుగు మందు డబ్బలతో ప్రధాన రహదారి పై బాధితుల నిరసన
తమ భూముల్లో అక్రమంగా గుడిసెలు వేస్తున్నారని పురుగు మందు డబ్బాలతో ఏటూరునాగారం మణుగూరు ప్రధాన రహదారిపై ఇంటి స్థలం దారులు , 60 మంది స్థానికులు బైఠాయించి పురుగుల మందు డబ్బా లతో నిరసన వ్యక్తం చేశారు.తమ ఇంటి స్థలాలు అక్రమంగా అక్రమించుకోవాలని కొంత మంది వ్యక్తులు ప్రయత్నం చెయ్యడం తో పాటు బలవంతంగా గుడిసెలు వేస్తున్నారని వారు ఆవేదన వెలుబుచ్చారు. తమని విప్ రేగా కాంతారావు ఆదుకోవాలని వేడుకుంటున్నారు.