పూజా హెగ్డే గుంటూరు కారం సినిమా నుండి తప్పుకోవడానికి కారణం ఇదే…
పూజా హెగ్డే టాలీవుడ్ ఇండస్ట్రీలో తన గ్రామర్సైన్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని ఎంతగానో ఆలరించిన హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు..
ఈమె మంచి సినిమాలు ఎంచుకొని తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించి వారి మనసులో దోచుకుంది.. అయితే తాజాగా ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో హీరోయిన్గా వచ్చి మళ్లీ మధ్యలో తప్పుకున్న విషయం తెలిసిందే..
అయితే ఈ విషయంపై పలు రూమర్లు గతంలో వినిపించాయి ఆ రోమర్లకు బదులుగా డైరెక్టర్ నాగ వంశీ స్పష్టం చేశారు…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘గుంటూరు కారం’. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఐతే ఈ చిత్రంలో మొదట హీరోయిన్గా పూజా హెర్డేని తీసుకున్నారు.
కానీ ఏవో కారణాల వలన ఆమె ప్రాజెక్ట్ నుంచి బయటికివచ్చారు. పూజాకి చిత్ర యూనిట్ మధ్య ఏవో విబే దాలు వచ్చాయని, అందుకే ఆమెని తప్పించారని కొన్ని రూమర్స్ వినిపిం చాయి.
ఐతే ఇప్పుడీ విషయంలో పూర్తిగా క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. “మొదట ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేద్దామని అనుకున్నాం. తర్వాత 2024 పండక్కి మార్చాం. దీంతో మాకు మరింత సమయం దొరికింది. తొంద ర లేకుండా నెమ్మదిగా షూటింగ్ చేయాలనుకున్నాం.
ఐతే అదే సమ యంలో పూజా హెర్డే మరో హిందీ మూవీలో నటించాల్సి వచ్చింది. డేట్స్ అడ్జెస్ట్ కాకపో వడంతో ఆమెను రీప్లేస్ చేశాం. అంతేగానీ ఇందులో ఎలాంటి సమస్యలు లేవు అని చెప్పుకొచ్చారు నాగవంశీ. ఇదే సమయంలో గుంటూ రు కారం రిలీజ్ డేట్ప కూడా క్లారిటీ ఇచ్చారు. సంక్రాంతికి పక్కా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం.
ఈ సినిమాపై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి.. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు వింటేజ్ లుక్స్ తో కనిపించబోతున్నాడు.. ఈ సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘనవిజయం సాధించి వసూళ్ల వర్షం కురిపించబోతున్నట్టున్నారు అభిమానుల…