సమాజంలో ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైనది
ఉత్తమ అవార్డు గ్రహీతలకు ఘనంగా సన్మానం.
స్థానిక ఎంపీపీ గుండ గాని కవితా రాములు గౌడ్
తుంగతుర్తి సెప్టెంబర్ 16 నిజం చెపుతాం న్యూస్
తుంగతుర్తి మండల కేంద్రంలోని స్త్రీ శక్తి భవనంలో జరిగిన మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రధాన కార్యక్రమంలో సభాధ్యక్షులుగా బోయిన లింగయ్య ముఖ్యఅతిథిగా ఎంపీపీ గుండ గాని కవితా రాములు గౌడ్ అతిథిగా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు ఎంపీడీవో భీమ్ సింగ్ మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య
గుండగాని రాములు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు యాకయ్య కే రవీందర్ ఎఫ్ ఎల్ ఎన్ ఇంచార్జ్ మా గీ గురువయ్య పిఆర్టియు మండల అధ్యక్షులు శ్రీ ఎర్ర హరికృష్ణ యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి రవీందర్ డిటి ఎఫ్ జిల్లా కౌన్సిలర్ మిర్యాల మధు టి పి టి ఎఫ్ బాధ్యులు సిహెచ్ కరుణాకర్ పాల్గొన్నారు
మండల పరిధిలో 13 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానించగా జిల్లా పరిధిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఐదుగురిని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడు పొందిన వెంకట రామ నర్సమ్మ సన్మానించారు
ఎంపీపీ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పాత్ర చాలా గొప్పది అని తెలిపారు సైదులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకత్వం తెలిపారు
సీతయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు గొప్ప గా పని చేయాలని తెలిపారు రాములు మాట్లాడుతూ నాయకత్వ లక్షణాలు ఉన్న వాడు మాత్రమే ఉపాధ్యాయ అవుతాడు అని చెప్పారు
భీం సింగర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల కృషి ఎనలేనిది అని చెప్పారు…